భారత్‌లో కరోనా కేసుల వివరాలు

- February 22, 2022 , by Maagulf
భారత్‌లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులుల 15 వేల దిగువకు వచ్చాయి. నిన్న ఒక్కరోజు భారత్‌లో 13,405 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారించారు. డైలీ పాజిటివిటీ రేటు 1.24 శాతానికి దిగొచ్చింది. రికవరీ రేటు ఏకంగా 98.38 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,81,075 మంది కరోనాకు చికిత్స  పొందుతున్నారు.

సోమవారం ఒక్కరోజులో 34,226 మంది కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. వారితో కలిపితే భారత్‌లో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,21,58,510 (4 కోట్ల 21 లక్షల 58 వేల 510)కు చేరింది. అదే సమయంలో మరో 235 మంది కొవిడ్ తో పోరాడుతూ చనిపోయారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,12,344కు చేరనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. దేశంలో కరోనా మరణాలు సంఖ్య 5,12,344 (5 లక్షల 12 వేల 344)2కు చేరినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com