ఇండియా, పాకిస్తాన్ ప్రయాణీకులకు నేటి నుంచి ర్యాపిడ్ కోవిడ్ టెస్టులు అవసరం లేదు

- February 22, 2022 , by Maagulf
ఇండియా, పాకిస్తాన్ ప్రయాణీకులకు నేటి నుంచి ర్యాపిడ్ కోవిడ్ టెస్టులు అవసరం లేదు

యూఏఈ: ఎంపిక చేసిన కొన్ని దేశాల నుంచి దుబాయ్ వచ్చే ప్రయాణీకులు ఇకపై ర్యాపిడ్ కోవిడ్ పీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు.ఈమేరకు ట్రావెల్ ఏజెంట్లు మరియు ఎయిర్ లైన్స్‌కి అథారిటీస్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు చెందినవారు నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ (48 గంటల ముందు తీసుకున్నది) తమ వెంట తెచ్చుకోవాలి. దుబాయ్ వచ్చిన తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. పరీక్షా ఫలితాలు వచ్చేవరకు సెల్ఫ్ క్వారంటైన్‌లో వుండాలి. ఫ్లై దుబాయ్ ఈ వివరాల్ని తమ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com