తెలంగాణ: మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు
- February 23, 2022
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. విద్యారంగంలోనూ తెలంగాణను నంబర్ వన్ స్థానంలో ఉంచాలనే లక్ష్యంతో మన ఊరు- మన బడి కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా స్కూల్స్ ఎంపిక చేస్తూ.. ప్రైవేటు స్కూల్స్ దోపిడీ ని అరికట్టేందుకు ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.
పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకు రావాలని, కోటి రూపాయలు విరాళం ఇస్తే ఆ స్కూలు కు వారి పేరు పెడతామని ఆయన పేర్కొన్నారు. మొదటి విడతలోనే 65 శాతం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించామని, 12 రకాల అంశాల్లో పాఠశాలల అభివృద్ధి చేస్తున్నామన్నారు. తాగు నీరు, విద్యుత్, ఫర్నీచర్, శానిటేషన్, కిచెన్ షెడ్, ప్రహరీ గోడల నిర్మాణం చేపడుతున్నామని ఆయన వెల్లడిమచారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే హెడ్ మాస్టర్ ల పై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం