మార్చి 5 వరకు మస్కట్ బుక్ ఫెయిర్
- February 24, 2022
ఒమన్: సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైథమ్ అల్ సైద్, సమాచార మంత్రి డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ హర్రాసీ లు మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2022 (MIBF) 26వ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు సమక్షంలో ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC) ఈ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. మస్కట్ బుక్ ఫెయిర్ మార్చి 5 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ముగింపు వేడుకలకు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 29 కళారూపాల ద్వారా గవర్నరేట్లోని ప్రజల జీవనాన్ని తెలిపేలా ప్రదర్శించనున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్లో 27 దేశాల నుండి 715 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. 3,61,230 పుస్తకాలను ప్రదర్శనకు పెట్టనున్నారు. దాదాపు 114 సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







