మార్చి 5 వరకు మస్కట్ బుక్ ఫెయిర్
- February 24, 2022
ఒమన్: సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైథమ్ అల్ సైద్, సమాచార మంత్రి డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ హర్రాసీ లు మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2022 (MIBF) 26వ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు సమక్షంలో ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC) ఈ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. మస్కట్ బుక్ ఫెయిర్ మార్చి 5 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ముగింపు వేడుకలకు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 29 కళారూపాల ద్వారా గవర్నరేట్లోని ప్రజల జీవనాన్ని తెలిపేలా ప్రదర్శించనున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్లో 27 దేశాల నుండి 715 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. 3,61,230 పుస్తకాలను ప్రదర్శనకు పెట్టనున్నారు. దాదాపు 114 సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- నేడు హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం
- తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!