మార్చి 5 వరకు మస్కట్ బుక్ ఫెయిర్
- February 24, 2022
ఒమన్: సాంస్కృతిక, క్రీడలు, యువజన శాఖ మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ థెయాజిన్ బిన్ హైథమ్ అల్ సైద్, సమాచార మంత్రి డాక్టర్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ హర్రాసీ లు మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 2022 (MIBF) 26వ ఎడిషన్ను ప్రారంభించనున్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు సమక్షంలో ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC) ఈ వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. మస్కట్ బుక్ ఫెయిర్ మార్చి 5 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ముగింపు వేడుకలకు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ గౌరవ అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 29 కళారూపాల ద్వారా గవర్నరేట్లోని ప్రజల జీవనాన్ని తెలిపేలా ప్రదర్శించనున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్లో 27 దేశాల నుండి 715 ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. 3,61,230 పుస్తకాలను ప్రదర్శనకు పెట్టనున్నారు. దాదాపు 114 సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









