భారత్ కరోనా అప్డేట్

- February 24, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి.దీంతో ప్రజలు ఉపశమనం చెందుతున్నారు. నెమ్మదిగా కరోనా ఆంక్షలు తొలగిపోతున్నాయి. శ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,148 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 302 మంది మరణించారు.దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,81,179కి చేరింది.కరోనా మృతుల సంఖ్య 5,12,924గా నమోదైంది.

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశంలో డైలీ కరోనా పాజిటివిటీ రేటు 1.22 శాతానికి పరిమితమైంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. బధవారం మరో 30,49,988 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,76,52,31,385కు చేరినట్లు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com