BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించిన భారత ప్రతినిధి బృందం
- February 24, 2022
అబుధాబి: భారత పార్లమెంట్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం అబుధాబిలోని నిర్మాణంలో ఉన్న BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. UAE, ఇండియా మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ బలంగా ఉన్నాయన్నారు. ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) తో రెండు దేశాల మధ్య బంధం బలపడిందన్నారు.అబుధాబి క్రౌన్ ప్రిన్స్, భారత ప్రధాన మంత్రి మోడీలు ఫిబ్రవరి 2018లో ప్రారంభించిన BAPS హిందూ దేవాలయం.. యూఏఈ-ఇండియా స్నేహానికి చిహ్నంగా మారిందన్నారు. భారత ప్రతినిధి బృందంలో 17 మందిలో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.ఈ సందర్భంగా ఓం బిర్లాతో UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయేషా కూడా ఉన్నారు.అంతకుముందు ప్రతినిధి బృందానికి పూజ్య బ్రహ్మవిహారి స్వామి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.దేవాలయం నిర్మాణం గురించి వారికి వివరించారు. ఒక ఇటుకను స్పాన్సర్ చేయడం ద్వారా ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం ఉందని, మరిన్ని వివరాలను క్రింది లింక్లో చూడవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!