BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించిన భారత ప్రతినిధి బృందం
- February 24, 2022
అబుధాబి: భారత పార్లమెంట్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం అబుధాబిలోని నిర్మాణంలో ఉన్న BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. UAE, ఇండియా మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ బలంగా ఉన్నాయన్నారు. ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) తో రెండు దేశాల మధ్య బంధం బలపడిందన్నారు.అబుధాబి క్రౌన్ ప్రిన్స్, భారత ప్రధాన మంత్రి మోడీలు ఫిబ్రవరి 2018లో ప్రారంభించిన BAPS హిందూ దేవాలయం.. యూఏఈ-ఇండియా స్నేహానికి చిహ్నంగా మారిందన్నారు. భారత ప్రతినిధి బృందంలో 17 మందిలో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.ఈ సందర్భంగా ఓం బిర్లాతో UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయేషా కూడా ఉన్నారు.అంతకుముందు ప్రతినిధి బృందానికి పూజ్య బ్రహ్మవిహారి స్వామి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.దేవాలయం నిర్మాణం గురించి వారికి వివరించారు. ఒక ఇటుకను స్పాన్సర్ చేయడం ద్వారా ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం ఉందని, మరిన్ని వివరాలను క్రింది లింక్లో చూడవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.





తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్గ్రేడ్లో 72% పనులు పూర్తి..







