BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించిన భారత ప్రతినిధి బృందం
- February 24, 2022
అబుధాబి: భారత పార్లమెంట్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం అబుధాబిలోని నిర్మాణంలో ఉన్న BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. UAE, ఇండియా మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ బలంగా ఉన్నాయన్నారు. ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) తో రెండు దేశాల మధ్య బంధం బలపడిందన్నారు.అబుధాబి క్రౌన్ ప్రిన్స్, భారత ప్రధాన మంత్రి మోడీలు ఫిబ్రవరి 2018లో ప్రారంభించిన BAPS హిందూ దేవాలయం.. యూఏఈ-ఇండియా స్నేహానికి చిహ్నంగా మారిందన్నారు. భారత ప్రతినిధి బృందంలో 17 మందిలో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.ఈ సందర్భంగా ఓం బిర్లాతో UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయేషా కూడా ఉన్నారు.అంతకుముందు ప్రతినిధి బృందానికి పూజ్య బ్రహ్మవిహారి స్వామి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.దేవాలయం నిర్మాణం గురించి వారికి వివరించారు. ఒక ఇటుకను స్పాన్సర్ చేయడం ద్వారా ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం ఉందని, మరిన్ని వివరాలను క్రింది లింక్లో చూడవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.





తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







