BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించిన భారత ప్రతినిధి బృందం
- February 24, 2022
అబుధాబి: భారత పార్లమెంట్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం అబుధాబిలోని నిర్మాణంలో ఉన్న BAPS హిందూ దేవాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ.. UAE, ఇండియా మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ బలంగా ఉన్నాయన్నారు. ఇటీవల కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) తో రెండు దేశాల మధ్య బంధం బలపడిందన్నారు.అబుధాబి క్రౌన్ ప్రిన్స్, భారత ప్రధాన మంత్రి మోడీలు ఫిబ్రవరి 2018లో ప్రారంభించిన BAPS హిందూ దేవాలయం.. యూఏఈ-ఇండియా స్నేహానికి చిహ్నంగా మారిందన్నారు. భారత ప్రతినిధి బృందంలో 17 మందిలో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో సహా పలువురు ప్రముఖులు ఉన్నారు.ఈ సందర్భంగా ఓం బిర్లాతో UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయేషా కూడా ఉన్నారు.అంతకుముందు ప్రతినిధి బృందానికి పూజ్య బ్రహ్మవిహారి స్వామి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.దేవాలయం నిర్మాణం గురించి వారికి వివరించారు. ఒక ఇటుకను స్పాన్సర్ చేయడం ద్వారా ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశం ఉందని, మరిన్ని వివరాలను క్రింది లింక్లో చూడవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.





తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









