దుబాయ్ ఎయిర్పోర్టుల్లో ప్రయాణీకులు 35 దిర్హామ్లు చెల్లించాలి
- March 31, 2016
దుబాయ్ పోర్ట్ని వినియోగించుకునే ప్రయాణీకులు ఇకపై 35 దిర్హామ్లు చెల్లించవలసి ఉంటుంది. దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఈ మేరకు రిజల్యూషన్ పాస్ చేశారు. ఎయిర్పోర్ట్ల్లో ప్రయాణీకులు సౌకర్యాలను వినియోగించుకున్నందుకుగాను వినియోగరుసుమును చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ నుంచి ప్రయాణించే ఏ ప్రయాణీకుడైనాసరే, ట్రాన్సిట్ ప్యాసింజర్స్తో కలిసి సర్వీసు ఛార్జీగా 35 దిర్హామ్లుగా చెల్లించాలి. ఎయిర్లైన్స్ సంస్థలు టిక్కెట్లు ఇచ్చే సమయంలోనే ఈ రుసుమును వసూలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్స్కీ, తద్వారా దుబాయ్ ప్రభుత్వ ట్రెజరీకీ ఈ మొత్తం చేరుకుంటుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా అభివద్ధి చేయడానికి ఈ నిధుల్ని వినియోగిస్తారు. అధికారిక గెజిట్లో ప్రచురితమైనప్పటినుంచీ ఈ ఫీజు అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







