తెలంగాణ కరోనా అప్డేట్

- February 24, 2022 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణలో గడచిన 24 గంటల్లో 35వేల 837 కరోనా పరీక్షలు నిర్వహించగా, 311 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 90 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 31, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 16, మంచిర్యాల జిల్లాలో 15 కేసులు వెలుగుచూశాయి.

అదే సమయంలో 614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,88,096 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,79,893 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,092 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111కి పెరిగింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజుతో(348) పోలిస్తే కొత్త కేసులు కాస్త తగ్గాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com