ఏపీ పోలీస్ ఖాతాలో.. మరో 15 అవార్డులు
- February 25, 2022అమరావతి: జాతీయ స్థాయిలో టెక్నాలజీ, వినియోగంలో తాజాగా మరో 15 అవార్డులను ఏపీ పోలీస్ శాఖ దక్కించుకుంది. టెక్నాలజీ సభ- 2022 ప్రకటించిన అవార్డులలో 15 అవార్డులను వివిధ విభాగాల్లో కైవసం చేసుకొని, మొత్తం 165 అవార్డు లను ఏపీ పోలీస్ శాఖ గెలుచుకుంది. టెక్నాలజీ వినియోగంలో జాతీయస్థాయిలో 165 అవార్డులతో మొదటి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ నిలిచింది. టెక్నాలజీ వినియోగిస్తూ జాతీయ స్థాయిలో అవార్డుల దక్కించుకోవడంతో మాపై ప్రజలకు సేవ చేసే బాధ్యత మరింతగా పెంచిందని డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఆయన పోలీస్ ప్రధాన కార్యాలయం తోపాటు వివిధ జిల్లాలో అవార్డులను సాధించిన సిబ్బందిని అభినందించారు.జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న విజేతలందరిని ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అభినందించారు. అయితే పోలీస్ ప్రధాన కార్యాలయం (8), అనంతపురం (1), చిత్తూరు (1), తిరుపతి అర్బన్ (2), కడప (1), ప్రకాశం (1), విజయవాడ సిటీ (1) చొప్పున అవార్డులను తమ ఖాతాలో వేసుకున్నాయి.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్