బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో సరికొత్త గేమ్ ను రూపొందించిన హైదరాబాద్ సంస్థ
- February 26, 2022
ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన టెక్నాలజీల్లో బ్లాక్ చెయిన్, మెటావర్స్ టెక్నాలజీలు పటిష్టమైనవి. ఈ రెండు టెక్నాలజీలను అనుసంధానం చేస్తు హైదరాబాద్కు చెందిన గేమింగ్ ఇండస్ట్రీ ఓ గేమ్ను క్రియోట్ చేసింది. ఈ గేమ్ లో హైలెవల్ కు వెళ్లే కొద్ది క్రిప్టో టోకెన్లను గెలుచుకోవచ్చని, ఈ టోకెన్లను క్రిప్టో ఎక్చేంజ్ ద్వారా సొమ్ము చేసుకోవచ్చని గేమ్ తయారీదారులు చెబుతున్నారు. హైదరాబాద్ స్టార్టప్ సంస్థ క్లింగ్ ట్రేడింగ్ సంస్థ ఈ గేమ్ను రూపొందించింది. ప్రస్తుతం బీటా వెర్షన్ మార్చిలో అందుబాటులోకి రానున్నట్టు గేమింగ్ నిర్వహాకులు తెలిపారు.
2022 జూన్ నుంచి ఈ గేమింగ్ ఫుల్ వెర్షన్ సామన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుందని క్లింగ్ ట్రేడింగ్ సంస్థ తెలియజేసింది. ఆ గేమింగ్లో ఒక్కో లెవల్ దాటుకుంటూ పోయే కొలది క్రిప్టో టోకెన్లు గెలుకుంటారు. అయితే, ఈ క్రిప్టో టోకెన్లను నగదుగా మార్చుకునేందుకు వీలుగా పాన్కేక్ స్వాపింగ్ డీ సెంట్రలైజ్డ్ ఎక్చేంజీతో ఒప్పందం చేసుకున్నట్టు నిర్వహకులు పేర్కొన్నారు. ఒకేసారి అనేక మంది ఈ గేమ్ను ఆడేందుకు వీలుగా మెటావర్స్ టెక్నాలజీని పొందుపరిచారు. దీంతో వర్చువల్గా ఒకేసారి అనేకమంది ఈ గేమ్ను ఆడేందుకు వీలు ఉంటుందని క్లింగ్ ట్రేడింగ్ సంస్థ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!