బ్రిడ్జి కూలి 10 మంది మృతి ; కోల్‌కతా

- March 31, 2016 , by Maagulf
బ్రిడ్జి కూలి 10 మంది మృతి ; కోల్‌కతా

కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గిరీష్ పార్క్ వద్ద గణేష్ టాకీస్ సమీపంలో చోటు చేసుకుంది. బ్రిడ్జి కూలిపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసి, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. బ్రిడ్జి కూలడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతూనే, ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com