వ్యాక్సినేటెడ్ ప్యాసింజర్లకు పీసీఆర్ టెస్ట్ లేదు: ఎయిర్ ఇండియా
- February 27, 2022
యూఏఈ: ఇండియా నుంచి యూఏఈకి వచ్చే వ్యాక్సినేటెడ్ ప్యాసింజర్లకు ప్రీ-ట్రావెల్ కోవిడ్-19 PCR టెస్ట్ అవసరం లేదని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తెలిపింది. ఈ మేరకు యుఎఇ ప్రభుత్వం ట్రావెల్ నిబంధనలను సడలించినట్లు పేర్కొంది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ప్రయాణీకులు తప్పనిసరిగా WHO లేదా UAE ఆమోదించిన వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి అయినట్లు తెలిపే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను సమర్పించాలి. అదే వ్యాక్సిన్ వేయించుకోని ప్రయాణికులు మాత్రం ప్రయాణానికి 48 గంటలముందు చేయించుకున్న నెగటివ్ కోవిడ్-19 సర్టిఫికేట్ ను సమర్పించాలి. లేదా కరోనా వచ్చి కోలుకున్నట్లు(నెల వ్యవధి) సంబంధిత అధికారులు జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ను అయినా సమర్పించవచ్చు. UAEకి వచ్చిన తర్వాత ప్రయాణీకులందరూ PCR టెస్ట్ చేయించుకోవలసి ఉంటుంది. రిజల్ట్ వచ్చే వరకు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ రెండింట్లోనూ కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







