వ్యాక్సినేటెడ్ ప్యాసింజర్లకు పీసీఆర్ టెస్ట్ లేదు: ఎయిర్ ఇండియా
- February 27, 2022
యూఏఈ: ఇండియా నుంచి యూఏఈకి వచ్చే వ్యాక్సినేటెడ్ ప్యాసింజర్లకు ప్రీ-ట్రావెల్ కోవిడ్-19 PCR టెస్ట్ అవసరం లేదని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తెలిపింది. ఈ మేరకు యుఎఇ ప్రభుత్వం ట్రావెల్ నిబంధనలను సడలించినట్లు పేర్కొంది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ప్రయాణీకులు తప్పనిసరిగా WHO లేదా UAE ఆమోదించిన వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి అయినట్లు తెలిపే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను సమర్పించాలి. అదే వ్యాక్సిన్ వేయించుకోని ప్రయాణికులు మాత్రం ప్రయాణానికి 48 గంటలముందు చేయించుకున్న నెగటివ్ కోవిడ్-19 సర్టిఫికేట్ ను సమర్పించాలి. లేదా కరోనా వచ్చి కోలుకున్నట్లు(నెల వ్యవధి) సంబంధిత అధికారులు జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ను అయినా సమర్పించవచ్చు. UAEకి వచ్చిన తర్వాత ప్రయాణీకులందరూ PCR టెస్ట్ చేయించుకోవలసి ఉంటుంది. రిజల్ట్ వచ్చే వరకు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ రెండింట్లోనూ కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఫ్లిప్కార్ట్ లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి అక్టోబర్ 8 వరకు ఆఫర్లు
- బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సౌదీ సెంట్రల్ బ్యాంక్..!!
- క్రిమినల్ జస్టిస్.. ఖతార్ లో కొత్త విభాగం ఏర్పాటు..!!
- అనుమతి లేకుండా ఫిల్మింగ్..వ్యక్తికి Dh30,000 ఫైన్..!!
- ఎయిర్ ఇండియా నిర్ణయంపై కేరళ ప్రవాసుల ఆందోళన..!!
- ఒమానీ-సౌదీ ఉమ్మడి సైనిక వ్యాయామం..!!
- GCC ఆర్థిక ఐక్యతకు బహ్రెయిన్ కృషి..!!
- ఇంట్లో నకిలీ మద్యం తయారీ..మహిళా అరెస్టు..!!
- డొమెస్టిక్ వర్కర్ల కోసం 4వ దశ సాలరీ బదిలీ సేవ ప్రారంభం..!!
- యూదుల ప్రార్థనామందిరం పై ఉగ్రదాడి.. ఇద్దరు మృతి