వ్యాక్సినేటెడ్ ప్యాసింజర్లకు పీసీఆర్ టెస్ట్ లేదు: ఎయిర్ ఇండియా
- February 27, 2022
యూఏఈ: ఇండియా నుంచి యూఏఈకి వచ్చే వ్యాక్సినేటెడ్ ప్యాసింజర్లకు ప్రీ-ట్రావెల్ కోవిడ్-19 PCR టెస్ట్ అవసరం లేదని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ తెలిపింది. ఈ మేరకు యుఎఇ ప్రభుత్వం ట్రావెల్ నిబంధనలను సడలించినట్లు పేర్కొంది. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ప్రయాణీకులు తప్పనిసరిగా WHO లేదా UAE ఆమోదించిన వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి అయినట్లు తెలిపే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను సమర్పించాలి. అదే వ్యాక్సిన్ వేయించుకోని ప్రయాణికులు మాత్రం ప్రయాణానికి 48 గంటలముందు చేయించుకున్న నెగటివ్ కోవిడ్-19 సర్టిఫికేట్ ను సమర్పించాలి. లేదా కరోనా వచ్చి కోలుకున్నట్లు(నెల వ్యవధి) సంబంధిత అధికారులు జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ను అయినా సమర్పించవచ్చు. UAEకి వచ్చిన తర్వాత ప్రయాణీకులందరూ PCR టెస్ట్ చేయించుకోవలసి ఉంటుంది. రిజల్ట్ వచ్చే వరకు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ రెండింట్లోనూ కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







