యుక్రెయిన్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న తెలుగు విద్యార్థులు..
- February 27, 2022
హైదరాబాద్: యుక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా తిరిగివచ్చారు. 20 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీరికి ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డితోపాటు డీసీపీ స్వాగతం పలికారు. వీరంతా నిన్న రాత్రి యుక్రెయిన్ నుంచి ముంబై చేరుకోగా కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. 20 మంది విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం స్వదేశానికి తరలిస్తోంది. విద్యార్థులు, పౌరులను ఎయిరిండియా విమానాల్లో తరలిస్తున్నారు. ఇప్పటివరకు 469 మంది భారతీయులు భారత్ కు చేరుకున్నారు. కాసేపట్లో మరో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకోనుంది. 240 మందితో బుడాపెస్ట్ నుంచి విమానం బయల్దేరింది.
నిన్న రాత్రి 219 మంది విద్యార్థులతో తొలి విమానం ముంబైకి చేరుకుంది. తెల్లవారుజామున 250 మందితో రెండో విమానం ఢిల్లీకి చేరుకుంది. 28 మంది తెలుగు విద్యార్థులు (తెలంగాణ-17, ఏపీ-11) ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇవాళ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు ఏపీ, తెలంగాణ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఇవాళ ఉదయం వారిని విమానంలో హైదరాబాద్ కు పంపించారు. 28 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారిని స్వస్థలాలకు చేరవేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన









