యూఏఈలో ఏపీ దివంగత మంత్రి మేకపాటి కి ఘన నివాళి
- February 27, 2022
యూఏఈ: ఏపీ రాష్ట్ర పరిశ్రమల వాణిజ్య మరియు ఐటీ శాఖ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల షార్జా లో APNRTS వారి ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో దుబాయ్ లోని కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా డా.అమన్ పూరి,జుల్ఫీ రావడ్జీ(ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు),APNRTS కో-ఆర్డినేటర్ ప్రసన్న సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హాజరైన సభ్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి ఔన్నత్యాన్ని,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి లోకి తీసుకొని వెళ్లేందుకు ఆయన చేసిన ప్రయత్నాల్ని గుర్తు చేసుకుంటూ బాధాతప్త హృదయాలతో ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.ఈ కార్యక్రమంకు APNRTS కో-ఆర్డినేటర్లు బ్రహ్మానంద రెడ్డి,శ్యామ్ సురేంద్ర,అక్రమ్ దగ్గర వుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి వెంకట అప్పా రెడ్డి, ఉదయ భాస్కర రెడ్డి,వెంకట రమణ,వెంకట రాజు,ఈశ్వర నాయుడు,సంజీవ్ ,సునీల్,యశ్వంత్,సుదర్శన్,జాఫర్ అలీ,అనురాధ,ఎస్.వేణు తదితరులు విచ్చేసి తమ సంతాపం ప్రకటించారు.



తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









