ముందస్తు పీసీఆర్ టెస్ట్ అవసరం లేదు: ఎతిహాద్
- February 27, 2022
అబుధాబి: ఫిబ్రవరి 26 నుండి అమల్లోకి వచ్చిన యూఏఈ కొత్త ట్రావెల్ నిబంధనల ప్రకారం.. పూర్తి వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారికి, ఎతిహాద్ ఎయిర్వేస్లో అబుధాబికి ప్రయాణించే గెస్ట్ లకు ఇకపై ముందస్తు PCR టెస్ట్ అవసరం లేదు.ఈ మేరకు ఎతిహాద్ ఎయిర్ వేస్ సంస్థ వెల్లడించింది.అలాగే వ్యాక్సినేటెడ్ అయి అబుధాబి ద్వారా బయలుదేరే వారికి కూడా PCR పరీక్షలు అవసరం లేదు.అయితే వ్యాక్సిన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా QR కోడ్ని కలిగి ఉండాలి. ప్రయాణికులు అబుధాబి ఎయిర్ పోర్టుకి చేరుకున్న తర్వాత మాత్రం ఉచిత కోవిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.వ్యాక్సిన్ వేయించుకోని వారు, అబుదాబికి లేదా అక్కడి నుండి ప్రయాణించే గెస్టులు మాత్రం తప్పనిసరిగా బయలుదేరిన 48 గంటలలోపు తీసుకున్న నెగిటివ్ PCR టెస్ట్ రిపోర్టు సమర్పించాలి లేదా కోవిడ్-19 వచ్చిన 30 రోజులలోపు QR కోడ్తో రికవరీ సర్టిఫికేట్ ను అందజేయాలి.16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు విమానంలో ప్రయాణించడానికి వ్యాక్సిన్, పీసీఆర్ టెస్టుల నుండి మినహాయింపు ఇచ్చారు.
తాజా వార్తలు
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు









