'డియర్‌ డాడ్‌' ద్వారా మళ్లీ బాలీవుడ్‌లోకి వెళ్లనున్న అరవింద్‌స్వామి

- March 31, 2016 , by Maagulf
'డియర్‌ డాడ్‌' ద్వారా మళ్లీ బాలీవుడ్‌లోకి  వెళ్లనున్న అరవింద్‌స్వామి

తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసిన నటుడు అరవింద్‌స్వామి మణిరత్నం 'రోజా'తో బాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. బోంబేతో ఆకట్టుకున్నాడు. 1998లో సాత్‌ రంగ్‌కె సప్నే తర్వాత 15 ఏళ్లకి ఇప్పుడు కొత్త దర్శకుడు తనుజ్‌ భ్రమర్స్‌ తెరకెక్కిస్తున్న 'డియర్‌ డాడ్‌' ద్వారా మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రంలో అరవింద్‌ స్వామి తండ్రి పాత్ర పోషిస్తున్నాడు.తండ్రికి, 14 ఏళ్ల కొడుక్కి మధ్య జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథ చాలా నచ్చిందని అందుకే మళ్లీ నటించాలని నిర్ణయించుకున్నానని అరవింద్‌ స్వామి తెలిపారు.ఈ చిత్ర పోస్టర్‌ను రేపు విడుదల చేయనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com