దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- March 31, 2016
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీ మరియు ఇన్వెస్టిగేషన్స్ ముగ్గురు ఒమనీ పౌరుల్ని అరెస్ట్ చేసింది. విలాయత్ సువైక్లో ఈ ముగ్గురూ దొంగతనానికి పాల్పడినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. అమాయకుల్ని, తమతోపాటు వాహనంలో ఎక్కించుకుని, వారిని గమ్యస్థానాలకు చేర్చుతామని చెప్పి, దారి తప్పించి వారిని దోచుకోవడం ఈ దొంగలకు వెన్నతో పెట్టిన విద్య అని పోలీసులు చెప్పారు. బాధితుల నుంచి డబ్బు, నగలు, సెల్ఫోన్లు, ఇతర ఖరీదైన వస్తువల్ని దోచుకుని, అక్కడి నుంచి ఆ దొంగలు పరారైపోతుండేవారు. నిందితుల్లో ఒకరు టైర్ షాప్ నుంచి 8 కార్ టైర్లను దొంగిలించాడు. ఆ టైర్లను తమ దొంగతనాలకు వినియోగిస్తున్న కారుకే వాడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









