ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీతో మాట్లాడిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- March 05, 2022
యూఏఈ: అబుదాబి క్రౌన్ ప్రిన్స్, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో మాట్లాడారు. ఉక్రెయిన్లో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాజా పరిణామాలపై షేక్ మొహమ్మద్కు జెలెన్స్ కీ వివరించాడు. ఈ సందర్భంగా చర్చల ద్వారానే శాంతియుత పరిష్కారాలు లభిస్తాయని జెలెన్ స్కీకి షేక్ మొహమ్మద్ వివరించారు. సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ఉద్దేశించిన ప్రతి చర్యకు UAE మద్దతు ఇస్తుందన్నారు. ఉక్రెయిన్లోని బాధిత పౌరులకు మానవతా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు షేక్ మొహమ్మద్ స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా త్వరగా సమస్యలను పరిష్కరించుకోవాలని షేక్ మొహమ్మద్ సూచించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







