పాకిస్థాన్‌లోని మస్జీద్ పై ఉగ్రదాడిని ఖండించిన బహ్రెయిన్

- March 05, 2022 , by Maagulf
పాకిస్థాన్‌లోని మస్జీద్ పై ఉగ్రదాడిని ఖండించిన బహ్రెయిన్

మనామా: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలోని మస్జీదుపై జరిగిన ఉగ్రదాడిని  బహ్రెయిన్ రాజ్యం తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ... బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి పాకిస్తాన్‌ తీసుకునే చర్యలకు అండగా ఉంటామని సంఘీభావాన్ని తెలియజేసింది. ఉగ్రవాద సంస్థలు, వాటికి మద్దతు ఇచ్చే లేదా ఆర్థిక సహాయం చేసే వారందరికీ వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా బహ్రెయిన్ తేల్చి చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com