సందర్శకులు తాజ్‌మహల్‌ చూడాలంటే రూ.1000 చెల్లించా లి

- March 31, 2016 , by Maagulf
సందర్శకులు తాజ్‌మహల్‌ చూడాలంటే రూ.1000 చెల్లించా లి

భారత్‌లోని ప్రఖ్యాత కట్టడాల సందర్శన టిక్కెట్‌ ధరలను పురావస్తు శాఖ భారీగా పెంచింది 'ఏ', 'బి' కేటగిరీల కట్టడాల సందర్శనకు విదేశీయులకు టిక్కెట్‌ ధరలు రెట్టింపయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్‌మహల్‌ సందర్శనకు విదేశీయులకు గతంలో రూ.250 టిక్కెట్‌ ఉంటే... ఇప్పడది... రూ.500కు చేరింది. టోల్‌ పన్నులు అన్ని కలిపి విదేశీ సందర్శకులు తాజ్‌మహల్‌ చూడాలంటే రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.దేశీయ సందర్శకులు మాత్రం రూ.30 చెల్లిస్తే తాజ్‌మహల్‌ సందర్శించవచ్చు. ఆగ్రా డెవలప్‌మెంట్‌ అథారిటీ వసూలు చేసే టోల్‌ ట్యాక్స్‌తో కలిపి రూ.40 అవుతుంది. గతంలో తాజ్‌మహల్‌, కుతుబ్‌మినార్‌ తదితర 'ఏ' కేటగిరీ కట్టడాలకు రూ.10 టిక్కెట్‌ ఉండగా... ఇప్పుడు రూ.30కి పెంచారు.అలాగే 'బీ' కేటగిరీ కట్టడాలకు భారతీయులకు రూ.5 నుంచి రూ.15 చేశారు. విదేశీయులకు రూ.100 నుంచి రూ.200 చేశారు. విదేశీయులు 'ఏ' కేటగిరీ కట్టడాలకు రూ.750, 'బి' కేటగిరీ కట్టడాలకు రూ.300 చెల్లిస్తే ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయని పురావస్తు శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com