సందర్శకులు తాజ్మహల్ చూడాలంటే రూ.1000 చెల్లించా లి
- March 31, 2016
భారత్లోని ప్రఖ్యాత కట్టడాల సందర్శన టిక్కెట్ ధరలను పురావస్తు శాఖ భారీగా పెంచింది 'ఏ', 'బి' కేటగిరీల కట్టడాల సందర్శనకు విదేశీయులకు టిక్కెట్ ధరలు రెట్టింపయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్మహల్ సందర్శనకు విదేశీయులకు గతంలో రూ.250 టిక్కెట్ ఉంటే... ఇప్పడది... రూ.500కు చేరింది. టోల్ పన్నులు అన్ని కలిపి విదేశీ సందర్శకులు తాజ్మహల్ చూడాలంటే రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.దేశీయ సందర్శకులు మాత్రం రూ.30 చెల్లిస్తే తాజ్మహల్ సందర్శించవచ్చు. ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసే టోల్ ట్యాక్స్తో కలిపి రూ.40 అవుతుంది. గతంలో తాజ్మహల్, కుతుబ్మినార్ తదితర 'ఏ' కేటగిరీ కట్టడాలకు రూ.10 టిక్కెట్ ఉండగా... ఇప్పుడు రూ.30కి పెంచారు.అలాగే 'బీ' కేటగిరీ కట్టడాలకు భారతీయులకు రూ.5 నుంచి రూ.15 చేశారు. విదేశీయులకు రూ.100 నుంచి రూ.200 చేశారు. విదేశీయులు 'ఏ' కేటగిరీ కట్టడాలకు రూ.750, 'బి' కేటగిరీ కట్టడాలకు రూ.300 చెల్లిస్తే ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయని పురావస్తు శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!







