వాణిజ్య మోసాలపై CPA అవగాహన క్యాంపెయిన్
- March 08, 2022
మస్కట్: సుల్తానేట్లో వాణిజ్య మోసాలపై అవగాహన కల్పించడానికి వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) క్యాంపెయిన్ ను ప్రారంభించింది. సౌత్ షర్కియా గవర్నరేట్లోని వినియోగదారుల రక్షణ విభాగం మసీరాలోని ఆటో స్పేర్ పార్ట్స్ షాపులలో తనిఖీ, అవగాహన ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో ఆటో విడిభాగాల నాణ్యతను, సుల్తానేట్లో ఆమోదించబడిన స్పెసిఫికేషన్లు, ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది. నార్త్ బటినా గవర్నరేట్లోని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సహకారంతో 'వాణిజ్య మోసం, వినియోగదారు, వ్యాపారులపై దాని ప్రభావం' అనే పేరుతో సోమవారం ఒక సింపోజియం కూడా నిర్వహించింది. క్యాంపెయిన్ లో భాగంగా నార్త్ బతినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సోమవారం నకిలీ, అసలైన వస్తువుల మొబైల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించింది. ఫిబ్రవరి-2022లో CPA వాణిజ్య మోసానికి వ్యతిరేకంగా ‘అసలైన ఉత్పత్తులకు కట్టుబడి ఉండండి’ అనే పేరుతో ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









