వాణిజ్య మోసాలపై CPA అవగాహన క్యాంపెయిన్
- March 08, 2022
మస్కట్: సుల్తానేట్లో వాణిజ్య మోసాలపై అవగాహన కల్పించడానికి వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) క్యాంపెయిన్ ను ప్రారంభించింది. సౌత్ షర్కియా గవర్నరేట్లోని వినియోగదారుల రక్షణ విభాగం మసీరాలోని ఆటో స్పేర్ పార్ట్స్ షాపులలో తనిఖీ, అవగాహన ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో ఆటో విడిభాగాల నాణ్యతను, సుల్తానేట్లో ఆమోదించబడిన స్పెసిఫికేషన్లు, ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది. నార్త్ బటినా గవర్నరేట్లోని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సహకారంతో 'వాణిజ్య మోసం, వినియోగదారు, వ్యాపారులపై దాని ప్రభావం' అనే పేరుతో సోమవారం ఒక సింపోజియం కూడా నిర్వహించింది. క్యాంపెయిన్ లో భాగంగా నార్త్ బతినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సోమవారం నకిలీ, అసలైన వస్తువుల మొబైల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించింది. ఫిబ్రవరి-2022లో CPA వాణిజ్య మోసానికి వ్యతిరేకంగా ‘అసలైన ఉత్పత్తులకు కట్టుబడి ఉండండి’ అనే పేరుతో ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







