వాణిజ్య మోసాలపై CPA అవగాహన క్యాంపెయిన్
- March 08, 2022
మస్కట్: సుల్తానేట్లో వాణిజ్య మోసాలపై అవగాహన కల్పించడానికి వినియోగదారుల రక్షణ అథారిటీ (CPA) క్యాంపెయిన్ ను ప్రారంభించింది. సౌత్ షర్కియా గవర్నరేట్లోని వినియోగదారుల రక్షణ విభాగం మసీరాలోని ఆటో స్పేర్ పార్ట్స్ షాపులలో తనిఖీ, అవగాహన ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో ఆటో విడిభాగాల నాణ్యతను, సుల్తానేట్లో ఆమోదించబడిన స్పెసిఫికేషన్లు, ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడటం లక్ష్యంగా పెట్టుకుంది. నార్త్ బటినా గవర్నరేట్లోని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నరేట్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సహకారంతో 'వాణిజ్య మోసం, వినియోగదారు, వ్యాపారులపై దాని ప్రభావం' అనే పేరుతో సోమవారం ఒక సింపోజియం కూడా నిర్వహించింది. క్యాంపెయిన్ లో భాగంగా నార్త్ బతినా గవర్నరేట్లోని డైరెక్టరేట్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ సోమవారం నకిలీ, అసలైన వస్తువుల మొబైల్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించింది. ఫిబ్రవరి-2022లో CPA వాణిజ్య మోసానికి వ్యతిరేకంగా ‘అసలైన ఉత్పత్తులకు కట్టుబడి ఉండండి’ అనే పేరుతో ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







