నిషేధిత వస్తువుల విక్రయం.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
- March 08, 2022
యూఏఈ: అబుదాబిలో నిషిద్ధ వస్తువులు విక్రయిస్తున్నందుకు, వివిధ రకాల ఆయుధాలను కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్లోని స్పెషల్ పెట్రోల్ డిపార్ట్ మెంట్కు చెందిన అల్ మిర్సాద్ విభాగానికి అనుబంధంగా ఉన్న అల్ దఫ్రాలోని అల్ మిర్సాద్ బ్రాంచ్ ఇద్దరు ఆసియన్లు, ఒక ఆఫ్రికన్ జాతీయుడిని అరెస్టు చేసినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు సాగిస్తున్న బృందం గురించి పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే స్పందించి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి కత్తులు తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







