నిషేధిత వస్తువుల విక్రయం.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
- March 08, 2022
యూఏఈ: అబుదాబిలో నిషిద్ధ వస్తువులు విక్రయిస్తున్నందుకు, వివిధ రకాల ఆయుధాలను కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్లోని స్పెషల్ పెట్రోల్ డిపార్ట్ మెంట్కు చెందిన అల్ మిర్సాద్ విభాగానికి అనుబంధంగా ఉన్న అల్ దఫ్రాలోని అల్ మిర్సాద్ బ్రాంచ్ ఇద్దరు ఆసియన్లు, ఒక ఆఫ్రికన్ జాతీయుడిని అరెస్టు చేసినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు సాగిస్తున్న బృందం గురించి పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే స్పందించి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి కత్తులు తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







