నిషేధిత వస్తువుల విక్రయం.. ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
- March 08, 2022
యూఏఈ: అబుదాబిలో నిషిద్ధ వస్తువులు విక్రయిస్తున్నందుకు, వివిధ రకాల ఆయుధాలను కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్లోని స్పెషల్ పెట్రోల్ డిపార్ట్ మెంట్కు చెందిన అల్ మిర్సాద్ విభాగానికి అనుబంధంగా ఉన్న అల్ దఫ్రాలోని అల్ మిర్సాద్ బ్రాంచ్ ఇద్దరు ఆసియన్లు, ఒక ఆఫ్రికన్ జాతీయుడిని అరెస్టు చేసినట్లు అబుదాబి పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు సాగిస్తున్న బృందం గురించి పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే స్పందించి నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి కత్తులు తదితర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







