'సరైనోడు' ఆడియో విడుదల ..

- April 01, 2016 , by Maagulf
'సరైనోడు' ఆడియో విడుదల ..

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన చిత్రం 'సరైనోడు'. ఈ చిత్రం ఆడియోను శుక్రవారం నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్‌ సంగీతం సమకూర్చారు. కేథరిన్‌ త్రెసా, శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి, జయప్రకాశ్‌ రెడ్డి, అంజలి, రాహుల్‌శర్మ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో 'సరైనోడు' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com