మహజూజ్ లక్కీ డ్రా వివరాల ప్రకటన
- March 12, 2022
దుబాయ్: మహజూజ్ లక్కీ డ్రాలో భారత వ్యక్తికి అదృష్టం వరించింది.భారత్కు చెందిన ఉత్తమ్ అనే వ్యక్తి తాజాగా దుబాయ్లో నిర్వహించిన మహజూజ్ డ్రాలో లక్ష దిర్హమ్స్ గెలుకున్నాడు. మహజూజ్ డ్రాలో పాల్గొన్న మూడోసారికే ఉత్తమ్కు ఈ జాక్పాట్ తగలడం విశేషం.ఈ భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఉత్తమ్ ఆనందం వ్యక్తం చేశాడు.ఇక తాను గెలిచిన ఈ భారీ నగదులో కొంత భాగం కూతుళ్ల చదువుకు, మరికొంత భాగాన్ని తన అప్పులను తీర్చడానికి వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే చాలా రోజుల నుంచి తన భార్యకు మంచి నగలు కొనిపెట్టాలని అనుకుంటున్నానని, అది కూడా ఇంత త్వరగా నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు.
ఇంతకుముందు కూడా డ్రాలో(రెండోసారి) పాల్గొన్నప్పుడు 350 దిర్హమ్స్ గెలుచుకున్నట్లు తెలిపాడు.ఇప్పటి వరకు మూడుసార్లు లక్కీ డ్రాలో పాల్గొంటే రెండుసార్లు గెలవడం ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.ఇక ముందు కూడా తాను ఇలాగే మహజూజ్ డ్రాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు ఉత్తమ్ చెప్పాడు. తన లాంటి తక్కువ జీతాలతో ఉపాధి పొందుతున్నవారికి మహజూజ్ డ్రా అనేది తక్కువ సమయంలో ఎక్కువ మనీ సంపాదించేందుకు మంచి ప్లాట్ఫామ్ అని కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసే ఉత్తమ్ చెప్పుకొచ్చాడు.ఇదే డ్రాలో ఉత్తమ్తో పాటు మరో ఇద్దరు ప్రవాసులు రెహా(ఫిలిప్పీన్స్), టాంక్రెడో(ఫిలిప్పీన్స్) కూడా చెరో లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







