బహ్రెయిన్ రాజును కలుసుకున్న మొహమ్మద్ బిన్ జాయెద్
- March 14, 2022
అబుధాబి: బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను అబుధాబిలోని అతని నివాసంలో అబుధాబి క్రౌన్ ప్రిన్స్, సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలుసుకున్నారు. రెండు దేశాల మధ్య సోదర సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వారు సమీక్షించారు. సుస్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలను మెరుగుపరిచే విధంగా, ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు అన్ని రంగాలలో సహకారాన్ని విస్తరించే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశానికి హిజ్ మెజెస్టి కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్స్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా, హిస్ హైనెస్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖలో స్పెషల్ అడ్వైజర్ షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







