బహ్రెయిన్ రాజును కలుసుకున్న మొహమ్మద్ బిన్ జాయెద్
- March 14, 2022
అబుధాబి: బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాను అబుధాబిలోని అతని నివాసంలో అబుధాబి క్రౌన్ ప్రిన్స్, సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కలుసుకున్నారు. రెండు దేశాల మధ్య సోదర సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే అవకాశాలను వారు సమీక్షించారు. సుస్థిరమైన అభివృద్ధి ప్రయత్నాలను మెరుగుపరిచే విధంగా, ప్రజల ఆకాంక్షలను సాకారం చేసేందుకు అన్ని రంగాలలో సహకారాన్ని విస్తరించే మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశానికి హిజ్ మెజెస్టి కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్స్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా, హిస్ హైనెస్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖలో స్పెషల్ అడ్వైజర్ షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!







