భారత్ కరోనా అప్డేట్
- March 14, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఖతం కావడానికి దగ్గరిలోనే ఉన్నట్లు అనిపిస్తోంది.వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో భారీగా కేసులు తగ్గిపోతున్నాయి. పాజిటివ్ కేసులు గతంలో కంటే తక్కువ సంక్యలో రికార్డు అవుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా 2 వేల 503 కరోనా కేసులు నమోదయ్యాయని, 27 మంది వైరస్ బారిన పడి చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్నాటక రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని అక్కడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు కరోనా వైరస్ వెలుగు చూసిన చైనాలో గత పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోసారి వైరస్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. కోవిడ్ – 19 కేసుల్లో దేశంలోని రెండు అతిపెద్ద నగరాలైన షెన్ జాన్, షాంఘై వైరస్ లు వ్యాపించడంతో కఠినమైన ఆంక్షలు విధించాయి. మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చైనా చాంగ్చున్లో కరోనా విజృంభిస్తోంది. 90 లక్షల జనాభా ఉండే చాంగ్చున్లో దాదాపు 4 వందల కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చాంగ్చున్లో లాక్డౌన్ విధించారు. గత రెండు రోజుల నుంచి అధికారులు కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇక చైనాలో శనివారం 15 వందల కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 తర్వాత అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







