భారత్ కరోనా అప్డేట్
- March 14, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా ఖతం కావడానికి దగ్గరిలోనే ఉన్నట్లు అనిపిస్తోంది.వైరస్ తగ్గుముఖం పడుతుండడంతో భారీగా కేసులు తగ్గిపోతున్నాయి. పాజిటివ్ కేసులు గతంలో కంటే తక్కువ సంక్యలో రికార్డు అవుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా 2 వేల 503 కరోనా కేసులు నమోదయ్యాయని, 27 మంది వైరస్ బారిన పడి చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్నాటక రాష్ట్రంలో గత 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించలేదని అక్కడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మరోవైపు కరోనా వైరస్ వెలుగు చూసిన చైనాలో గత పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోసారి వైరస్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. కోవిడ్ – 19 కేసుల్లో దేశంలోని రెండు అతిపెద్ద నగరాలైన షెన్ జాన్, షాంఘై వైరస్ లు వ్యాపించడంతో కఠినమైన ఆంక్షలు విధించాయి. మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చైనా చాంగ్చున్లో కరోనా విజృంభిస్తోంది. 90 లక్షల జనాభా ఉండే చాంగ్చున్లో దాదాపు 4 వందల కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చాంగ్చున్లో లాక్డౌన్ విధించారు. గత రెండు రోజుల నుంచి అధికారులు కఠినంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఇక చైనాలో శనివారం 15 వందల కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 తర్వాత అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









