రమదాన్ మాసంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు
- March 15, 2022
కువైట్: కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉన్నందున రమదాన్ మాసంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలవుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పవిత్ర రమదాన్ మాసం కోసం అన్ని కార్యకలాపాలను పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రజారోగ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అండర్ సెక్రటరీ డాక్టర్ బుతైనా అల్-ముదాఫ్ చెప్పారు. కరోనా వైరస్ చివరి వేవ్ను అధిగమించడం కోసం అందరూ నియంత్రణ చర్యలను పాటించాలని కోరారు. అన్ని గవర్నరేట్లలో ఆరోగ్య బృందాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయని డాక్టర్ అల్-ముదాఫ్ అన్నారు. రమదాన్తో సహా పూర్తిగా నెలంతా కార్యకలాపాలను తిరిగి అనుమతించడంతో అందరూ సుఖ సంతోషాలతో, జాగ్రత్తల నడుమ ఇఫ్తార్లు, పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







