ఒమన్, ఖతార్ కార్మిక మంత్రులు భేటీ
- March 15, 2022
మస్కట్: ఖతార్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ అలీ సెయిద్ సమీఖ్ అల్ మర్రీ ప్రతినిధి బృందం నిన్న కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మహద్ సయిద్ బావోయిన్ను తన కార్యాలయంలో సమావేశమయ్యారు. లేబర్ మార్కెట్, హ్యూమన్ రిసోర్స్ (హెచ్ఆర్) అభివృద్ధి, ఇతర సహకార రంగాలకు సంబంధించిన వివిధ రంగాలలో సంబంధాలను పెంపొందించే మార్గాలపై ఇరు దేశాల నేతలు సమావేశంలో చర్చించారు. ఎంప్లాయ్ మెంట్ పరంగా ఒమన్ సుల్తానేట్లో కార్మిక మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో వేతన రాయితీ, లేబర్ సెక్యూరిటీ, ట్రైనింగ్.. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో రిక్రూట్ మెంట్, స్థానికీకరణ రేట్లు అభివృద్ధి దశలపై అభిప్రాయాలను పంచుకున్నారు. సేఫ్ గైడ్ లైన్స్, వృత్తిపరమైన వెల్నెస్తో పాటు ఉద్యోగ స్థానికీకరణ, ట్రైనింగ్ రంగంలో ఒమానీ అనుభవాన్ని ఖతార్ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ అండర్ సెక్రటరీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







