ఒమన్, ఖతార్ కార్మిక మంత్రులు భేటీ
- March 15, 2022
మస్కట్: ఖతార్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ అలీ సెయిద్ సమీఖ్ అల్ మర్రీ ప్రతినిధి బృందం నిన్న కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మహద్ సయిద్ బావోయిన్ను తన కార్యాలయంలో సమావేశమయ్యారు. లేబర్ మార్కెట్, హ్యూమన్ రిసోర్స్ (హెచ్ఆర్) అభివృద్ధి, ఇతర సహకార రంగాలకు సంబంధించిన వివిధ రంగాలలో సంబంధాలను పెంపొందించే మార్గాలపై ఇరు దేశాల నేతలు సమావేశంలో చర్చించారు. ఎంప్లాయ్ మెంట్ పరంగా ఒమన్ సుల్తానేట్లో కార్మిక మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో వేతన రాయితీ, లేబర్ సెక్యూరిటీ, ట్రైనింగ్.. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో రిక్రూట్ మెంట్, స్థానికీకరణ రేట్లు అభివృద్ధి దశలపై అభిప్రాయాలను పంచుకున్నారు. సేఫ్ గైడ్ లైన్స్, వృత్తిపరమైన వెల్నెస్తో పాటు ఉద్యోగ స్థానికీకరణ, ట్రైనింగ్ రంగంలో ఒమానీ అనుభవాన్ని ఖతార్ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ అండర్ సెక్రటరీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









