ఒమన్, ఖతార్ కార్మిక మంత్రులు భేటీ
- March 15, 2022
మస్కట్: ఖతార్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ అలీ సెయిద్ సమీఖ్ అల్ మర్రీ ప్రతినిధి బృందం నిన్న కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మహద్ సయిద్ బావోయిన్ను తన కార్యాలయంలో సమావేశమయ్యారు. లేబర్ మార్కెట్, హ్యూమన్ రిసోర్స్ (హెచ్ఆర్) అభివృద్ధి, ఇతర సహకార రంగాలకు సంబంధించిన వివిధ రంగాలలో సంబంధాలను పెంపొందించే మార్గాలపై ఇరు దేశాల నేతలు సమావేశంలో చర్చించారు. ఎంప్లాయ్ మెంట్ పరంగా ఒమన్ సుల్తానేట్లో కార్మిక మంత్రిత్వ శాఖ సాధించిన విజయాలను కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో వేతన రాయితీ, లేబర్ సెక్యూరిటీ, ట్రైనింగ్.. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో రిక్రూట్ మెంట్, స్థానికీకరణ రేట్లు అభివృద్ధి దశలపై అభిప్రాయాలను పంచుకున్నారు. సేఫ్ గైడ్ లైన్స్, వృత్తిపరమైన వెల్నెస్తో పాటు ఉద్యోగ స్థానికీకరణ, ట్రైనింగ్ రంగంలో ఒమానీ అనుభవాన్ని ఖతార్ ప్రతినిధి బృందానికి వివరించారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ అండర్ సెక్రటరీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







