స్మశానాల్లో అంత్యక్రియల్ని ఫోటోలు తీస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే!
- March 15, 2022
కువైట్: కువైట్ మునిసిపాలిటీ - డైరెక్టర్ ఆఫ్ ఫ్యునరల్ డిపార్టుమెంట్ డాక్టర్ ఫైసల్ అల్ అవాదీ వెల్లడించిన వివరాల ప్రకారం స్మశానాల్లో ఎవరైనా ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తే 5,000 కువైటీ దినార్ల జరీమానా విధించడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులు, అథ్లెట్లు, సెలబ్రిటీలు వంటివారి ఇంట్లో విషాద ఘటన జరిగినప్పుడు, అంత్యక్రియల సమయంలో స్మశానాల వద్ద అకారణంగా గుమికూడేవారి సంఖ్య పెరగడం, ఫొటోలు, వీడియోలు తీయడం వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా మారుతోంది. స్మశానాల్ని నిర్దేశిత పనుల నిమిత్తం తప్ప, ఇతర కార్యక్రమాలకు వినియోగించకూడదు. అలా వినియోగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఆయా చట్టాలు కల్పిస్తున్నాయి. 2,000 దినార్లకు తగ్గకుండా 5,000 దినార్లకు మించకుండా ఉల్లంఘనలకు జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు
- మహారాష్ట్రలో రైలు బ్రేకుల ఫెయిల్యూర్
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్కు సర్వం సిద్ధం..!!









