స్మశానాల్లో అంత్యక్రియల్ని ఫోటోలు తీస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే!
- March 15, 2022
కువైట్: కువైట్ మునిసిపాలిటీ - డైరెక్టర్ ఆఫ్ ఫ్యునరల్ డిపార్టుమెంట్ డాక్టర్ ఫైసల్ అల్ అవాదీ వెల్లడించిన వివరాల ప్రకారం స్మశానాల్లో ఎవరైనా ఫొటోలు, వీడియోలు చిత్రీకరిస్తే 5,000 కువైటీ దినార్ల జరీమానా విధించడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులు, అథ్లెట్లు, సెలబ్రిటీలు వంటివారి ఇంట్లో విషాద ఘటన జరిగినప్పుడు, అంత్యక్రియల సమయంలో స్మశానాల వద్ద అకారణంగా గుమికూడేవారి సంఖ్య పెరగడం, ఫొటోలు, వీడియోలు తీయడం వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందికరంగా మారుతోంది. స్మశానాల్ని నిర్దేశిత పనుల నిమిత్తం తప్ప, ఇతర కార్యక్రమాలకు వినియోగించకూడదు. అలా వినియోగించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఆయా చట్టాలు కల్పిస్తున్నాయి. 2,000 దినార్లకు తగ్గకుండా 5,000 దినార్లకు మించకుండా ఉల్లంఘనలకు జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







