థర్డ్ కంట్రీలో 14 రోజుల స్టే తప్పనిసరి: సౌదీ
- March 16, 2022
సౌదీ: ట్రావెల్ నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాల నుండి రాజ్యంలోకి రావాలనుకునే ప్రయాణికులందరికీ థర్డ్ కంట్రీలో 14 రోజుల స్టే తప్పనిసరి అని పాస్పోర్ట్ ల జనరల్ డైరెక్టరేట్ (జవాజాత్) స్పష్టం చేసింది. గత 14 రోజులలో ట్రావెల్ సస్పెండ్ చేసిన దేశాలలో విజిట్ చేయని వారు మాత్రమే రాజ్యంలోకి నేరుగా ప్రవేశించడానికి అనుమతించబడతారు. ప్రయాణికులు ఇకపై తప్పనిసరిగా COVID-19 ఇన్స్టిట్యూషనల్ హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే వారు వచ్చిన తర్వాత PCR లేదా యాంటీజెన్-నెగటివ్ కరోనావైరస్ పరీక్ష ఫలితాలను అందించాల్సిన అవసరం లేదు. అయితే అన్ని రకాల విజిట్ వీసాలపై వచ్చే వారందరూ కరోనావైరస్ ఇన్ఫెక్షన్ నుండి చికిత్సకు అయ్యే ఖర్చులను కవర్ చేసే బీమాను పొందవలసి ఉంటుంది. తాజాగా దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్ వానా, జింబాబ్వే, లెసోతో, ఎస్వాటిని, మొజాంబిక్, మలావి, మారిషస్, జాంబియా, మడగాస్కర్, అంగోలా, సీషెల్స్, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ కొమోరోస్, నైజీరియా, ఇథియోపియా, ఆఫ్ఘనిస్తాన్ ల ప్రత్యక్ష విమానాలపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేశారు.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









