థర్డ్ కంట్రీలో 14 రోజుల స్టే తప్పనిసరి: సౌదీ
- March 16, 2022
సౌదీ: ట్రావెల్ నిషేధాన్ని ఎదుర్కొంటున్న దేశాల నుండి రాజ్యంలోకి రావాలనుకునే ప్రయాణికులందరికీ థర్డ్ కంట్రీలో 14 రోజుల స్టే తప్పనిసరి అని పాస్పోర్ట్ ల జనరల్ డైరెక్టరేట్ (జవాజాత్) స్పష్టం చేసింది. గత 14 రోజులలో ట్రావెల్ సస్పెండ్ చేసిన దేశాలలో విజిట్ చేయని వారు మాత్రమే రాజ్యంలోకి నేరుగా ప్రవేశించడానికి అనుమతించబడతారు. ప్రయాణికులు ఇకపై తప్పనిసరిగా COVID-19 ఇన్స్టిట్యూషనల్ హోమ్ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే వారు వచ్చిన తర్వాత PCR లేదా యాంటీజెన్-నెగటివ్ కరోనావైరస్ పరీక్ష ఫలితాలను అందించాల్సిన అవసరం లేదు. అయితే అన్ని రకాల విజిట్ వీసాలపై వచ్చే వారందరూ కరోనావైరస్ ఇన్ఫెక్షన్ నుండి చికిత్సకు అయ్యే ఖర్చులను కవర్ చేసే బీమాను పొందవలసి ఉంటుంది. తాజాగా దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్ వానా, జింబాబ్వే, లెసోతో, ఎస్వాటిని, మొజాంబిక్, మలావి, మారిషస్, జాంబియా, మడగాస్కర్, అంగోలా, సీషెల్స్, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ కొమోరోస్, నైజీరియా, ఇథియోపియా, ఆఫ్ఘనిస్తాన్ ల ప్రత్యక్ష విమానాలపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేశారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!