ఆసియాన్ హ్యూమన్ ట్రాఫికర్లపై మార్చి 29న తీర్పు
- March 16, 2022
బహ్రెయిన్: ఇద్దరు ఆసియాకు చెందిన మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన ఇద్దరు ఆసియా హ్యూమన్ ట్రాఫికర్లపై మార్చి 29న తీర్పు చెప్పనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు బాధితులను కిడ్నాప్ చేసి, అపరిచితులతో లైంగిక సంబంధాల కోసం బలవంతం చేసేవారు. బాధితుల్లో ఒకరు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ కు వచ్చిన సమయంలో తప్పించుకోవడంలో భాగంగా ఆమె భవనం నుండి కిందకు దూకింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు కావడంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీంతో ముఠా గుట్టు రట్టు అయింది. బాధితురాలు చెప్పిన వివరాలతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ఒక సంవత్సరం క్రితం BD120 నెలవారీ కోసం గృహ సేవకునిగా పని చేయడానికి బహ్రెయిన్కి వచ్చానని, తనకు సోషల్ మీడియాలో ఒక ఆసియా మహిళతో పరిచయం ఏర్పడిందని, ఆమె నాకు స్థానిక హోటల్ లేదా ఆసుపత్రిలో క్లీనర్గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిందని, దీంతో వారిన మాటలను నమ్మి తన స్పాన్సర్ నుండి పారిపోయి.. వారి వద్దకు వెళ్లినట్టు బాధితురాలు ప్రాసిక్యూటర్లకు వివరించింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







