ఆసియాన్ హ్యూమన్ ట్రాఫికర్లపై మార్చి 29న తీర్పు
- March 16, 2022
బహ్రెయిన్: ఇద్దరు ఆసియాకు చెందిన మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన ఇద్దరు ఆసియా హ్యూమన్ ట్రాఫికర్లపై మార్చి 29న తీర్పు చెప్పనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. నిందితులు బాధితులను కిడ్నాప్ చేసి, అపరిచితులతో లైంగిక సంబంధాల కోసం బలవంతం చేసేవారు. బాధితుల్లో ఒకరు సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ కు వచ్చిన సమయంలో తప్పించుకోవడంలో భాగంగా ఆమె భవనం నుండి కిందకు దూకింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు కావడంతో ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీంతో ముఠా గుట్టు రట్టు అయింది. బాధితురాలు చెప్పిన వివరాలతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను ఒక సంవత్సరం క్రితం BD120 నెలవారీ కోసం గృహ సేవకునిగా పని చేయడానికి బహ్రెయిన్కి వచ్చానని, తనకు సోషల్ మీడియాలో ఒక ఆసియా మహిళతో పరిచయం ఏర్పడిందని, ఆమె నాకు స్థానిక హోటల్ లేదా ఆసుపత్రిలో క్లీనర్గా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిందని, దీంతో వారిన మాటలను నమ్మి తన స్పాన్సర్ నుండి పారిపోయి.. వారి వద్దకు వెళ్లినట్టు బాధితురాలు ప్రాసిక్యూటర్లకు వివరించింది.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!