రమదాన్ ఉపవాస సమయాల్లో ఫుడ్ సర్వీస్: పుకార్లను ఖండించిన సౌదీ అరేబియా
- March 17, 2022
సౌదీ అరేబియా: రమదాన్ ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు ఫుడ్ సెర్వ్ చేసేందుకు అనుమతులు జారీ అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని సౌదీ అరేబియా ఖండించింది. కౌన్సిల్ ఆఫ్ సౌదీ ఛాంబర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లకు అనుమతిచ్చినట్లుగా పేర్కొనబడుతోన్న విషయం పూర్తిగా అర్థరహితమని తెలుస్తోంది. కౌన్సిల్ ఈ విషయమై ఎవరికీ ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. కర్టెన్లు, కవర్లు అడ్డం పెట్టి వుంటే, రెస్టారెంట్లలో ఫుడ్ సర్వింగ్కి అనుమతులుంటాయన్నది సదరు ఫేక్ లెటర్ సారాంశం. సౌదీ అరేబియా, రమదాన్ మాసంలో, ఇప్తార్ సమయానికిముందు టేక్ అవే సర్వీస్కి అనుమతివ్వడం జరుగుతుంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ముస్లిం సోదరులు ఉపవాసం చేస్తారు రమదాన్ మాసంలో. కాగా, గత ఏడాది దుబాయ్ ప్రభుత్వం, పబ్లిక్ కనిపించకుండా షీల్డ్ కవర్లు అడ్డం పెట్టి నడిపే రెస్టారెంట్లలో ఫుడ్ సర్వింగ్కి ఉపవాస సమయంలో అనుమతిచ్చింది.
తాజా వార్తలు
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!







