అజ్మాన్లో అగ్నిప్రమాదం...10 ట్రక్కులు దగ్ధం
- March 18, 2022
యూఏఈ: అజ్మాన్లోని అల్ జుర్ఫ్ ఇండస్ట్రియల్ ఏరియా 2లోని రెండు డీజిల్ కంపెనీలకు చెందిన వాహనాల్లో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.సమాచారం అందుకన్న అజ్మాన్ సివిల్ డిఫెన్స్ బృందాలు..అజ్మాన్ పోలీసుల సహకారంతో మంటను ఆర్పివేశాయి.ఈ ప్రమాదంలో ఎటువంటి మానవ ప్రాణనష్టం జరగలేదు. కానీ 10 డీజిల్ ట్రక్కులు, ట్రైలర్లు దగ్ధమయ్యాయి.అజ్మాన్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ రేద్ ఒబైద్ అల్ జాబీ మాట్లాడుతూ.. అజ్మాన్ పోలీసుల సహకారంతో అడ్మినిస్ట్రేషన్ సెంటర్ అండ్ అల్ జార్ఫ్ సెంటర్కు చెందిన అగ్నిమాపక బృందాలు మంటలు వ్యాపించకుండా సకాలంలో మంటలను అదుపు చేశాయన్నారు. అర్ధరాత్రి దాటిన ప్రమాదం జరిగిందని, కేవలం ఒక గంటలోపు మంటలను పూర్తిగా నియంత్రించామన్నారు.అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతుందని అల్-జాబీ తెలిపారు.అగ్నిమాపక నిరోధక పరిస్థితులకు కట్టుబడి, అన్ని అగ్నిమాపక భద్రతా చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ







