ఇంటి వద్ద గంజాయి పెంపకం: బహ్రెయినీ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష
- March 19, 2022
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు ఓ బహ్రెయినీ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. నిందితుడు తన ఇంటి వద్ద అక్రమంగా గంజాయి సాగు చేస్తున్నట్లు అతనిపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే తాను కేవలం కూరగాయలు, పండ్లకు సంబంధించిన విత్తనాల్ని మాత్రమే నాటినట్లు కోర్టు ముందు తన వాదనను వినిపించాడు నిందితుడు. బహ్రెయిన్లో పలు చోట్ల డ్రగ్స్ విక్రయాలకు సంబంధించి విచారణ సందర్భంగా నిందితుడి గంజాయి సాగు గురించి సమాచారం అందడంతో పోలీసులు ఆ దిశగా మరింత లోతైన విచారణ చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సెర్చ్ వారెంట్ ద్వారా నిందితుడి గుట్టు బయటపెట్టారు పోలీసులు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ని నిందితుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







