20 మిలియన్ల సందర్శకులు: ఎక్స్పో 2020 దుబాయ్లో ప్రత్యేక సంబరాలు
- March 19, 2022
యూఏఈ: ఎక్స్పో 2020 దుబాయ్ 20 మిలియన్ల సందర్శకుల్ని ఆకట్టుకుంది. ఈ నేపత్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాల్ని నిర్వహించారు. మొత్తంగా 25 మిలియన్ల సందర్శకులు ఈ ఎక్స్పోని సందర్శిస్తారనేది ఓ అంచనా. ఆ లక్ష్యానికి కేవలం 5 మిలియన్ల సందర్శకుల దూరంలోనే వుందిప్పుడు. 70 శాతం సందర్శకులు యూఏఈకి చెందినవారే. 18 ఏళ్ళు పైబడిన వారి సందర్శనలు 2.8 మిలియన్లు. కాగా, 20 మిలియన్ల మార్కు చేరుకున్న దరిమిలా అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్ ప్రత్యేకంగా ప్రదర్శించారు నిర్వాహకులు. 2013లో ప్రారంభించిన ఎక్స్పో జర్నీ విజయవంతంగా నిర్వహింపబడుతుండడం ఆనందంగా వుందని నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో కూడా అత్యంత విజయవంతంగా దీన్ని నిర్వహించడం గర్వకారణంగా వుందన్నారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







