20 మిలియన్ల సందర్శకులు: ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో ప్రత్యేక సంబరాలు

- March 19, 2022 , by Maagulf
20 మిలియన్ల సందర్శకులు: ఎక్స్‌పో 2020 దుబాయ్‌లో ప్రత్యేక సంబరాలు

యూఏఈ: ఎక్స్‌పో 2020 దుబాయ్ 20 మిలియన్ల సందర్శకుల్ని ఆకట్టుకుంది. ఈ నేపత్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాల్ని నిర్వహించారు. మొత్తంగా 25 మిలియన్ల సందర్శకులు ఈ ఎక్స్‌పోని సందర్శిస్తారనేది ఓ అంచనా. ఆ లక్ష్యానికి కేవలం 5 మిలియన్ల సందర్శకుల దూరంలోనే వుందిప్పుడు. 70 శాతం సందర్శకులు యూఏఈకి చెందినవారే. 18 ఏళ్ళు పైబడిన వారి సందర్శనలు 2.8 మిలియన్లు. కాగా, 20 మిలియన్ల మార్కు చేరుకున్న దరిమిలా అత్యద్భుతమైన ఫైర్ వర్క్స్ ప్రత్యేకంగా ప్రదర్శించారు నిర్వాహకులు. 2013లో ప్రారంభించిన ఎక్స్‌పో జర్నీ విజయవంతంగా నిర్వహింపబడుతుండడం ఆనందంగా వుందని నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో కూడా అత్యంత విజయవంతంగా దీన్ని నిర్వహించడం గర్వకారణంగా వుందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com