ఫెడరల్ సుప్రీంకోర్టును సందర్శించిన భారత బృందం
- March 20, 2022
అబుధాబి: భారత రాయబారి సంజయ్ సుధీర్తో పాటు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని భారత సుప్రీంకోర్టు ప్రతినిధి బృందానికి ఫెడరల్ సుప్రీంకోర్టు అధ్యక్షుడు మహమ్మద్ హమద్ అల్ బాడి స్వాగతం పలికారు. అనంతరం భారతీయ న్యాయ ప్రతినిధి బృందం ఫెడరల్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో పర్యటించారు. అక్కడ వారు అధునాతన వ్యవస్థలతో అమర్చబడిన కోర్టు గదులను సందర్శించారు. చట్టపరమైన, న్యాయ విధానాల గురించి ప్రతినిధి బృందం అడిగి తెలుసుకున్నారు. UAE-భారత్ మధ్య బలమైన స్నేహం, సహకార సంబంధాలు ఈ పర్యటనతో మరింత మెరుగయ్యాయని అల్ బాడీ చెప్పారు. ఈసందర్భంగా స్మార్ట్ లిటిగేషన్, ఆటోమేషన్ వైపు ఫెడరల్ సుప్రీంకోర్టు చేపట్టిన సంస్కరణల గురించి భారతీయ న్యాయ ప్రతినిధి బృందానికి అల్ బాడీ వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







