ఫేషియల్, లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్తో స్మార్ట్ పెట్రోలింగ్
- March 20, 2022
దుబాయ్: ఫేషియల్, లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్తో స్మార్ట్ పెట్రోలింగ్ చేపట్టేందుకు దుబాయ్ పోలీసులు సిద్ధమయ్యారు. Dhs 196m విలువ చేసే ఒప్పందంలో దుబాయ్ పోలీసులు వచ్చే ఐదేళ్లలో దుబాయ్ ఆధారిత W మోటార్స్ తయారు చేసిన 400 ఘియాత్ స్మార్ట్ పెట్రోల్ వాహనాలను అందిస్తుంది. ఇందులో భాగంగా మొదటి బ్యాచ్ లో 10 స్మార్ట్ పెట్రోలింగ్ వాహనాలను భద్రతా దళాలకు పంపిణీ చేశారు. ఎక్స్ పో 2020 దుబాయ్లోని వరల్డ్ పోలీస్ సమ్మిట్ లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఎమర్జెన్సీ లైట్లు, పోలీస్ లైట్లు, సైడ్ స్టెప్స్, 360-డిగ్రీ డిప్లోయబుల్ కెమెరా, ఎనిమిది ఔటర్ నిఘా కెమెరాలు, ఫేషియల్, లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఘియాత్ వాహనాల్లో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంటిగ్రేటెడ్ 16-అంగుళాల సెంట్రల్ స్క్రీన్, ప్రధాన నియంత్రణ కేంద్రానికి అనుసంధానించబడిన ఆన్బోర్డ్ కంప్యూటర్, పెద్ద ప్యాసింజర్ డిస్ప్లే, డిస్పాచర్కు కనెక్ట్ చేయబడిన ఆండ్రాయిడ్ టాబ్లెట్, డ్రైవర్ బిహేవియర్ కెమెరా, ఇన్-క్యాబిన్ మానిటరింగ్ ఉన్నాయి. స్మార్ట్ పెట్రోల్లో కస్టమ్-బిల్ట్ రియర్ బెంచ్, గ్రిల్స్, ప్రొటెక్టివ్ కేజ్, రెస్క్యూ అండ్ సేఫ్టీ పరికరాలను నిల్వ చేయడానికి బూట్లో ప్రత్యేకంగా రూపొందించిన కంపార్ట్మెంట్, అలాగే బోర్డులో అధునాతన డ్రోన్తో కస్టమ్-బిల్ట్ డ్రోన్ బాక్స్ కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







