కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్
- March 22, 2022
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ వేదికగా మంగళవారం ప్రముఖ ఒడిశా కవి, ఒడిస్సా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ భగవన్ జయసింగ్ "టికీ అటకిజా-ఏ, పంత్ (కొంచెం వేచి ఉండండి, ఓ ట్రావెలర్) పేరిట రచించిన 8వ ఒడియా కవితల సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీవన గమనంలో ఓ ప్రయాణికుడిగా మృత్యువును ఆలింగనం చేసుకునే క్షణాన, దుఃఖాలు, వేదనలతో నిండిన సమకాలీన వాస్తవికతలో భాగంగా గత జ్ఞాపకాలను పునశ్చరణ చేసే కథానాయకుడి అనుభవం ఆధారంగా ఈ కవితలు రూపుదిద్దుకున్నాయి. స్వయంగా రచయిత, కవి అయిన రాష్ట్ర గవర్నర్ హరిచందన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవికతకు దగ్గరగా ఈ కవితా సంపుటి ఉందన్నారు. విభిన్న అంశాలను కధానాయకుడు మననం చేసుకునే విధానం ఈ కవితా సంపుటిలో ఆలోచింపచేసేదిగా సాగిందన్నారు. కార్యక్రమంలో ఒడిశా సాహిత్య అకాడమీ కన్వీనర్ బిజయానంద్ సింగ్,గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా,రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం







