కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్

- March 22, 2022 , by Maagulf
కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన ఏపీ గవర్నర్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజ్ భవన్ వేదికగా మంగళవారం  ప్రముఖ  ఒడిశా కవి, ఒడిస్సా సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ భగవన్ జయసింగ్ "టికీ అటకిజా-ఏ, పంత్ (కొంచెం వేచి ఉండండి, ఓ ట్రావెలర్)  పేరిట రచించిన 8వ ఒడియా కవితల సంకలనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. జీవన గమనంలో ఓ ప్రయాణికుడిగా మృత్యువును ఆలింగనం చేసుకునే క్షణాన,  దుఃఖాలు, వేదనలతో నిండిన సమకాలీన వాస్తవికతలో భాగంగా గత జ్ఞాపకాలను పునశ్చరణ చేసే కథానాయకుడి అనుభవం ఆధారంగా ఈ కవితలు రూపుదిద్దుకున్నాయి. స్వయంగా రచయిత, కవి అయిన రాష్ట్ర గవర్నర్  హరిచందన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవికతకు దగ్గరగా ఈ కవితా సంపుటి ఉందన్నారు. విభిన్న అంశాలను కధానాయకుడు మననం చేసుకునే విధానం ఈ కవితా సంపుటిలో ఆలోచింపచేసేదిగా సాగిందన్నారు.  కార్యక్రమంలో ఒడిశా సాహిత్య అకాడమీ కన్వీనర్ బిజయానంద్ సింగ్,గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా,రాజ్ భవన్ సంయిక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, ఉప కార్యదర్శి సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com