MOCI వెబ్సైట్లో ధరల నియంత్రణ వ్యవస్థ
- March 23, 2022
కువైట్: వినియోగదారుల కోసం తన అధికారిక వెబ్సైట్లో వస్తువుల ధరలను పర్యవేక్షించే వ్యవస్థను కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ(MOCI) ప్రారంభించింది. వినియోగదారులు ఇప్పుడు ఇంటి నుండి బయలుదేరే ముందే ఒక మార్కెట్ నుండి మరొక మార్కెట్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సహకార సంఘాలు, సూపర్ మార్కెట్లు, ఇతర విక్రయ కేంద్రాలలో ప్రాథమిక ఆహార పదార్థాల ధరలను చెక్ చేసుకోవచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. డైలీ సహకార సంఘాల ద్వారా ధరల డేటా అప్ డేట్ చేయబడుతుందని మంత్రిత్వ శాఖ వివరించింది. కృత్రిమ ధరల పెరుగుదలను నిరోధించే ప్రయత్నాలలో భాగంగా సప్లై, డిమాండ్ వ్యవస్థకు అనుగుణంగా వాటిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఈ వ్యవస్థ మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్ల పనిని సులభతరం చేస్తుంది. ధరల పర్యవేక్షణ, నియంత్రణలో వారికి సహాయపడుతుందని, ధరలో కృత్రిమ పెరుగుదలను నియంత్రిస్తుందని తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్, ప్రైవేట్ సెంట్రల్ మార్కెట్ల సహకారంతో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







