MOCI వెబ్సైట్లో ధరల నియంత్రణ వ్యవస్థ
- March 23, 2022
కువైట్: వినియోగదారుల కోసం తన అధికారిక వెబ్సైట్లో వస్తువుల ధరలను పర్యవేక్షించే వ్యవస్థను కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ(MOCI) ప్రారంభించింది. వినియోగదారులు ఇప్పుడు ఇంటి నుండి బయలుదేరే ముందే ఒక మార్కెట్ నుండి మరొక మార్కెట్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సహకార సంఘాలు, సూపర్ మార్కెట్లు, ఇతర విక్రయ కేంద్రాలలో ప్రాథమిక ఆహార పదార్థాల ధరలను చెక్ చేసుకోవచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. డైలీ సహకార సంఘాల ద్వారా ధరల డేటా అప్ డేట్ చేయబడుతుందని మంత్రిత్వ శాఖ వివరించింది. కృత్రిమ ధరల పెరుగుదలను నిరోధించే ప్రయత్నాలలో భాగంగా సప్లై, డిమాండ్ వ్యవస్థకు అనుగుణంగా వాటిని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామని పేర్కొంది. ఈ వ్యవస్థ మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్ల పనిని సులభతరం చేస్తుంది. ధరల పర్యవేక్షణ, నియంత్రణలో వారికి సహాయపడుతుందని, ధరలో కృత్రిమ పెరుగుదలను నియంత్రిస్తుందని తెలిపింది. ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్, ప్రైవేట్ సెంట్రల్ మార్కెట్ల సహకారంతో ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- హైదరాబాద్-బెంగళూరు హైవేపై కీలక నిర్ణయం. 6 వరుసలకు విస్తరణ
- ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..1.75 లక్షల వీసాలు రద్దు
- భారతీయుడిని తరలించిన ఒమన్ రాయల్ ఎయిర్ఫోర్స్..!!
- సౌదీలో 27,360 షెవర్లే కార్ల రీకాల్.. ఎయిర్బ్యాగ్ లో లోపం..!!
- కొలంబియాను వణికించిన భూకంపం..132కి పెరిగిన మృతుల సంఖ్య
- కార్ల అద్దాలకు 50 శాతం వరకు టింట్ అనుమతించాలని ప్రతిపాదన..!!
- కువైట్లో ప్రవాసులకు కీలక హెచ్చరిక.. కమర్షియల్ కన్సీల్మెంట్పై కఠిన నిబంధనలు..!!
- ‘ఇన్స్టా పేరెంటింగ్’తో పిల్లలకు ముప్పు.. యూఏఈ వైద్యుల హెచ్చరిక..!!
- రాత్రివేళ లైట్లు లేకుండా డ్రైవింగ్ చేస్తే QR10,000 వరకు జరిమానా..!!
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!







