మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

- March 25, 2022 , by Maagulf
మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూ ఢిల్లీ: మరోసారి చమురు ధరలు పెరిగి వినియోగదారులకి షాకిచ్చాయి.. తాజాగా లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 80 పైసల చొప్పున పెరిగాయి. నాలుగు రోజుల్లో మూడు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం.. దీనితో ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.97.81, డీజిల్‌ ధర రూ.89.07కు చేరాయి. ఇక హైదరాబాదులో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్‌ రూ.97.23కు చేరుకున్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 112.76కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 98.74గా ఉంది. మొత్తం ఈ మూడు రోజుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.2.40చొప్పున పెరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com