రమదాన్.. రిమోట్ వర్క్ కోసం బహ్రెయిన్ ఎంపీల ప్రతిపాదన
- March 28, 2022
బహ్రెయిన్: రమదాన్ పవిత్ర మాసంలో రిమోట్ వర్క్ వ్యవస్థను అమలు చేయడానికి అనుమతించాలని బహ్రెయిన్ ఎంపీల బృందం ప్రభుత్వం ముందు అత్యవసర ప్రతిపాదనను ఉంచింది. తాజా సాంకేతిక పురోగతులను పరిగణనలోకి తీసుకుంటూనే పనిని కొనసాగించేందుకు పొరుగు దేశాలు తీసుకున్న చర్యలకు అనుగుణంగా ఈ ప్రతిపాదన ఉంది. ప్రజా ప్రయోజనాలను సాధించేందుకు తమ అభ్యర్థనను అమలు చేయాలని ఎంపీలు కోరారు. ఇది పవిత్ర రమదాన్ మాసంలో కుటుంబ ఐక్యత, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుందని పేర్కొంది. గతంలో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో ప్రభుత్వం రిమోట్ వర్క్ అమలు చేసిందని తమ ప్రతిపాదనలో ప్రభుత్వానికి ఎంపీలు గుర్తు చేశారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!
- సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ మద్దతుగా ఉంటుంది: మాక్రాన్
- JEE మెయిన్ సెషన్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
- సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన DGCA..
- అమెరికా వీసాలకు ‘ట్రంప్’ బ్రేక్









