పోలీసుల పెట్రోలింగ్ రికార్డ్.. వ్యక్తికి 50,000 దిర్హామ్లు ఫైన్
- March 28, 2022
దుబాయ్: పోలీసుల గస్తీని రికార్డ్ చేసి, స్నేహితురాలితో వీడియో షేర్ చేసినందుకు ఓ వ్యక్తికి 50,000 దిర్హామ్లు జరిమానా విధించారు. 32 ఏళ్ల గల్ఫ్ దేశస్థుడికి దుబాయ్ క్రిమినల్ కోర్టు 50,000 దిర్హామ్ల జరిమానా విధించింది. పోలీసుల పెట్రోలింగ్ను చిత్రీకరించి, వీడియో క్లిప్ను 'స్నాప్చాట్' ద్వారా తన స్నేహితురాలికి పంపాడన్న అభియోగాలు నిరూపణ కావడంతో ఈ జరిమానను క్రిమినల్ కోర్టు విధించింది. దుబాయ్లోని పామ్ జుమేరా ప్రాంతంలో నిందితుడు అతని ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో ఉన్నారు. ఆ సమయంలో డ్రైవర్ మొబైల్ ఫోన్లో మాట్లాడుతుండగా పెట్రోలింగ్ పోలీసులు గమనించి.. ఫైన్ వేసారు. ఈ క్రమంలో కారు వెనుక సీటులో కూర్చొన్న నిందితుడు.. అసభ్యకరమైన పదాలతో పోలీసును దూషిస్తూ.. పోలీసు పెట్రోలింగ్ కారును ఫోన్లో రికార్డ్ చేశాడు. ఇది గమనించిన పోలీసు.. వీడియోలోని విషయాల గురించి ఆరా తీశాడు. ఫోన్ ఇవ్వడానికి కూడా నిందితుడు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కేసును సమీక్షించిన తర్వాత నిందితుడి అప్పీల్ ను కోర్టు కొట్టివేసింది. పోలీసుల రిపోర్ట్, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా కోర్టు నిందితుడికి భారీ జరిమాన విధిస్తూ తీర్పును వెలువరించింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







