దహిరాలో రాక్ కూలి ఆరుగురు కార్మికులు మృతి

- March 28, 2022 , by Maagulf
దహిరాలో రాక్ కూలి ఆరుగురు కార్మికులు మృతి

మస్కట్: ధహిరా గవర్నరేట్‌లోని ఇబ్రి విలాయత్‌లో కొండచరియలు కూలిన సంఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు కార్మికులను అధికారులు రక్షించారు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. దాహిరా గవర్నరేట్ ఇబ్రిలోని విలాయత్‌లోని అల్ అరిడ్ ప్రాంతంలో ఒక కొండచరియలు కూలిపోయినట్లు రెస్క్యూ బృందాలకు సమాచారం అందిందని, వెంటనే సబంధిత అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారని సీడీఏఏ తెలిపింది. రెస్యూ ఆపరేషన్ లో ఆరుగురు కార్మికులను రక్షించగా.. మరో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని అథారిటీ పేర్కొంది. శిథిలాల కింద తప్పిపోయిన కార్మికుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని CDAA తెలిపింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com