యాదాద్రి పునఃప్రారంభం ..'మహా కుంభ సంప్రోక్షణ' లో పాల్గొన్న సీఎం కేసీఆర్
- March 28, 2022
తెలంగాణ: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పున ప్రారంభం కానున్నది. యాదాద్రికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. మహాకుంభ సంప్రోక్షణ లో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొంటున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రి కి ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్ దంపతులు చేరుకున్నారు. బాలాలయం నుంచి ప్రారంభమైంది శోభాయాత్ర. స్వామి, అమ్మవార్ల యంత్రాలు, సువర్ణ ప్రతిష్ఠాలంకర మూర్తుల విగ్రహాలను వేద పండితులు, రుత్వికుల వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాలతో ప్రధానాలయం వరకు మొదలైంది శోభాయాత్ర.
ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు,పలువురు ప్రజా ప్రతినిధులు. అనంతరం 11:55 నిమిషాలకు మహా కుంభ సంప్రోక్షణలో పాల్గొననున్న 150 మంది రుత్వికులు. మహాకుంభ సంప్రోక్షణ లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం, స్వర్ణ ధ్వజస్తంభ సందర్శనలో పాల్గొననున్నారు కేసీఆర్. 12.20 నుండి 12.30 శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనం. యాదాద్రి ఆలయ పున ప్రారంభ పూజా కార్యక్రమాల్లో పాల్గొని దైవ దర్శనం చేసుకోనున్నారు ముఖ్యమంత్రి. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తారు దేవస్థానం అధికారులు.
తాజా వార్తలు
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







