దశల వారీగా షాంఘైలో లాక్ డౌన్ అమలు
- March 28, 2022
చైనా: చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్ధిక నగరంగా పేరుపొందిన షాంఘై నగరంలో ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు రికార్డు స్ధాయిలో పెరిగాయి.
దీంతో ఈరోజు నుంచి దశల వారీగా షాంఘైలో లాక్ డౌన్ అమలు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. షాంఘై నగరంలో 2.6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రాధమిక దశలోనే దీనిని అంతమొందించేందుకు షాంఘై నగరాన్ని అధికారులు రెండు భాగాలుగా విభజించారు.
నగరంలోని ప్రజలందరికీ మూకుమ్మడిగా కోవిడ్ టెస్టు లు చేయాలని నిర్ణయించారు. ప్రజలందరికి కోవిడ్ టెస్టింగ్ కిట్లను నేటి నుంచి అందచేయనున్నారు. జిలిన్ లోని ఈశాన్య ప్రావిన్స్ లో కూడా 500,000 ర్యాపిడ్-యాంటిజెన్ కిట్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. 2019 చివరిలో చైనాలోని వూహాన్ నగరంలో కరోనా బయట పడటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అదుపు చేయగలిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం
- ఏపీ ప్రభుత్వం జొమాటోకు రూ.9.63 కోట్ల ఫైన్!
- GHIAL తెలంగాణ ప్రభుత్వానికి ₹12.28 కోట్ల డివిడెండ్ చెల్లింపు
- మినీబస్–ట్రక్ ప్రమాద బాధితులను పరామర్శించిన దుబాయ్ పోలీసులు









