దశల వారీగా షాంఘైలో లాక్ డౌన్ అమలు
- March 28, 2022
చైనా: చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆ దేశ ఆర్ధిక నగరంగా పేరుపొందిన షాంఘై నగరంలో ఇటీవలి కాలంలో కోవిడ్ కేసులు రికార్డు స్ధాయిలో పెరిగాయి.
దీంతో ఈరోజు నుంచి దశల వారీగా షాంఘైలో లాక్ డౌన్ అమలు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. షాంఘై నగరంలో 2.6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రాధమిక దశలోనే దీనిని అంతమొందించేందుకు షాంఘై నగరాన్ని అధికారులు రెండు భాగాలుగా విభజించారు.
నగరంలోని ప్రజలందరికీ మూకుమ్మడిగా కోవిడ్ టెస్టు లు చేయాలని నిర్ణయించారు. ప్రజలందరికి కోవిడ్ టెస్టింగ్ కిట్లను నేటి నుంచి అందచేయనున్నారు. జిలిన్ లోని ఈశాన్య ప్రావిన్స్ లో కూడా 500,000 ర్యాపిడ్-యాంటిజెన్ కిట్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. 2019 చివరిలో చైనాలోని వూహాన్ నగరంలో కరోనా బయట పడటంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అదుపు చేయగలిగింది.
తాజా వార్తలు
- నువైసీబ్ బార్డర్ నుంచి కువైట్ ఎయిర్వేస్కు ఫాస్ట్-ట్రాక్ రూట్..!!
- 30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- ఒమన్ను ముంచెత్తిన వర్షాలు..ఆరుగురి మృతి..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్..ఉచిత ప్రవేశం పునఃప్రారంభం..!!
- ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల









