భారతీయ సంగీతం,నాట్యాలలో 'సిలికానాంధ్ర సంపద' PSTU జూనియర్,సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు
- March 28, 2022
ప్రవాసంలో నివసిస్తూ, కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, శాస్త్రీయ నృత్య కళలయిన కూచిపూడి, భరతనాట్యం మరియు ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్ధులకు, తెలుగు విశ్వ విద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్య ప్రణాళిక ద్వారా పరీక్షలు నిర్వహించి, అకడమిక్ క్రెడిట్స్ తో కూడిన జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికెట్స్ అందించే సంస్థ SAMPADA (Silicon Andhra Music Performing Arts and Dance Academy).ఈ విద్యాసంవత్సరం 2000 మంది విద్యార్ధుల పరీక్షలు నిర్వహిస్తోంది.
26 మార్చి2022 న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అధికారుల పర్యవేక్షణలో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అంతర్జాలం ద్వారా, దాదాపు 650 మంది కి పైగా విద్యార్ధులకు జూనియర్ సర్టిఫికేట్, సీనియర్ సర్టిఫికేట్ పరీక్షలు నిర్వహించడం జరిగింది.మరొక 1300 మంది విద్యార్ధులకు ఏప్రిల్ 9న లెవెల్ 1 మరియు లెవెల్ 3 పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.విద్యార్ధులు ఎవరూ తమ ఇళ్ళ నుండి బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక సహాయంతో సునాయాసంగా మరియు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి, విశ్వ విద్యాలయ అధికారులు, విద్యార్ధులు,తల్లి దండ్రులు, విద్యార్ధులకు శిక్షణ ఇచ్చిన గురువుల ప్రశంసలను అందుకున్నదని, ఈ పరీక్షలు సజావుగా నిర్వహించడంలో సంపద కీలక బృంద సభ్యులయిన ఫణిమాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి, జయమాధవి పునుగుపాటి, తెలుగు విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డా.భట్టు రమేష్ గారు,పరీక్షల నియంత్రణ అధికారి డా.మురళీ కృష్ణ, అంతర్జాతీయ తెలుగు కేంద్రం నిర్వహణాధికారి డా.రెడ్డి శ్యామల పర్యవేక్షణలో,అధికారుల బృంద సభ్యులైన డా.హనుమంతరావ్ కోట్ల, డా.పద్మప్రియ, డా. శ్రీనివాసాచారి, నృత్య విబాగం అధిపతి డా. వనజ ఉదయ్, సంగీత విభాగం అధిపతి డా.రాధ సారంగపాణి సహకారం ఎంతో ఉన్నదని, ఈ పరీక్షలు నిర్వహణను ముందుండి దిశా నిర్దేశం చేసిన తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సెలర్ డా.తంగెడ కిషన్ రావ్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామని సంపద డీన్ మరియు అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల ఒక ప్రకటనలో తెలిపారు.వచ్చే విద్యా సంవత్సరంలో పరీక్షలకు హాజరు కాదలచిన విద్యార్ధులు http://SAMPADA.SILICONANDHRA.ORG వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలిపారు.


తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









