'బంతిపూల జానకి' చిత్రం పోస్టర్ను మెహన్లాల్ విడుదల చేశారు...
- April 02, 2016
ధన్రాజ్, దీక్షాపంత్ జంటగా నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి రామ్ నిర్మిస్తున్న చిత్రం 'బంతిపూల జానకి'. ఈ చిత్రం గురువారంతో షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో గుమ్మడి కాయ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ధన్రాజ్ మాట్లాడుతూ, 'ఇటీవల మాలయాళ సూపర్స్టార్ మెహన్లాల్ మా చిత్రం పోస్టర్ను విడుదల చేశారు. ఆ పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. ఆయన పోస్టర్ విడుదల చేసిన వేళా విశేషమేంటోగాని షూటింగ్ మొత్తం అనుకున్నది అనుకున్నట్లుగా అంతా బాగా జరిగింది. నిర్మాత కళ్యాణిరామ్ మాపై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు కునేలా ఈ చిత్రాన్ని చేశాం. మంచి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రంలో జబర్దస్త్ బ్యాచ్ చేసే కామెడీ హైలెట్గా ఉంటుంది. ఈ చిత్ర కథకు హీరోగా సెట్ అవుతానని దర్శకుడు నన్ను సెలక్ట్ చేసుకున్నారు. డబ్బు కోసం కాకుండా వృత్తి సంతృప్తి కోసం ఈ చిత్రంలో నటించాను. అందరిని అలరిస్తుందని నమ్ముతున్నాను' అని అన్నారు. 'నాకిది రెండో చిత్రం. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాం. సినిమా కోసం ధన్రాజ్ అందించిన సహకారం మరువలేనిది. అవుట్ అండ్ అవుట్ థ్రిల్లింగ్ కామెడీతో సాగే చిత్రమిది' అని దర్శకుడు తెలిపారు. దీక్షాపంత్ మాట్లాడుతూ, 'ఇందులో జానకి పాత్రలో నటిస్తున్నాను. సినిమా విడుదలైన తర్వాత అందరూ నన్ను జానకి అనే పిలుస్తారు. అంతగా నా పాత్ర ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నాను' అని చెప్పారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







