ఐపీఎల్ 2022: హైదరాబాద్ టార్గెట్ 211
- March 29, 2022
పూణే: ఐపీఎల్ 2022 సీజన్ 15 లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు దంచి కొట్టింది. భారీ స్కోర్ చేసింది. డబుల్ సెంచరీ బాదింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ప్రత్యర్థి ముందు 211 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది.
రాజస్తాన్ బ్యాటర్లలో కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 27 బంతుల్లోనే 55 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. దేవ్ దత్ పడిక్కల్ (29 బంతుల్లో 41 పరుగులు), షిమ్రోన్ హెట్ మైర్ (13 బంతుల్లో 32 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్ జోస్ బట్లర్ 35 పరుగులు, యశస్వీ జైస్వాల్ 20 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ తలో రెండు వికెట్లు తీశారు. భువనేశ్వర్ కుమార్, రొమెరియో షెఫర్డ్ చెరో వికెట్ తీశారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









