మస్కట్లో 26 డెంగ్యూ కేసులు నమోదు
- March 31, 2022
మస్కట్: గత కొద్ది రోజుల్లో ఇరవై ఆరు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రి, హెచ్ఈ డాక్టర్ అహ్మద్ బిన్ మహ్మద్ అల్ సయీదీ తెలిపారు. COVID-19 మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికి పనిచేసిన సుప్రీం కమిటీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బౌషర్ విలాయత్లో 17, సీబ్ విలాయత్లో ఏడు, మరియు రెండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఏడిస్ ఈజిప్టి దోమలు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం సృష్టించకూడదని, పౌరులు, నివాసితులు తమ ఇళ్లలోని డబ్బాలు, టైర్లు లాంటి ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఆయన కోరారు. డెంగ్యూ అనేది ఒకరి నుంచి మరొకరికి నేరుగా సంక్రమించదని, ఈడెస్ ఈజిప్టి దోమల కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని హీత్ మంత్రిత్వ శాఖ (MoH) తెలియజేసింది. 2019 మరియు 2020లో మస్కట్, ధోఫర్లలో కూడా డెంగ్యూ జ్వరం నమోదు అయ్యాయని పేర్కొంది. డెంగ్యూ నివారణకు మార్గదర్శకాలను జారీ చేసింది. శరీరాన్ని కప్పి ఉంచే పొడవాటి స్లీవ్లు ఉన్న దుస్తులను ధరించాలని, శరీరంలోని బహిర్గత భాగాలపై దోమల వికర్షకాలను ఉపయోగించాలని, కిటికీ నెట్లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు