2023లో లులు గ్రూప్ ఐపీఓకి సన్నాహాలు

- March 31, 2022 , by Maagulf
2023లో లులు గ్రూప్ ఐపీఓకి సన్నాహాలు

కువైట్: లులు గ్రూప్ ఇంటర్నేషనల్, 2023లో ఐపీఓకి వెళ్ళనుంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ ఓ నివేదిక వెల్లడించింది. భారతీయ వ్యాపరవేత్త యూసుఫ్ అలీ, అబుదాబీ కేంద్రంగా లులు గ్రూపుని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ గ్రూపుకి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. మిడిల్ ఈస్ట్‌తోపాటుగా భారతదేశం, మలేసియా, ఇండోనేసియా మరియు ఈజిప్టుల్లో లులు గ్రూపు వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. హాస్పిటాలిటీ, షిప్పింగ్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ లులు గ్రూప్ కార్యకలాపాలు చేపడుతోంది. భారతదేశంలోని తమిళనాడులో 463 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు లులు గ్రూప్ ఇటీవలే ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com